కలం, వరంగల్ బ్యూరో: మహబూబాబాద్ (Mahabubabad) జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి అనంతరం తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తొర్రూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అమ్మపురం గ్రామానికి చెందిన కిన్నెర గుమ్ షావలి(35) కుటుంబ కలహాల నేపథ్యంలో మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ సమీపంలో తన ఇద్దరు పిల్లలు విలష్ (05) వికేష్ (03) లకు ఉరివేసి తానూ కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Read Also: వాట్సాప్ సంచలన నిర్ణయం.. 9400 ఎకౌంట్స్ బ్యాన్
Follow Us On : WhatsApp

