కలం, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవాని (Edupayala Vanadurga Bhavani) ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. ఆషాఢమాసం మూడో ఆదివారాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
ఫలాలతో విశేష అలంకరణ
ఆషాఢ మాస పూజల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వనదుర్గా దేవిని రకరకాల తాజా పండ్లతో ‘ఫలాంబరి దేవి’ రూపంలో అత్యంత మనోహరంగా అలంకరించారు. అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని భక్తులు దర్శించుకున్నారు.

