కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విదేశీ పర్యటన అనంతరం రాష్ట్రానికి వచ్చిన తర్వాత తొలిసారి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka)తో భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం భట్టి విక్రమార్క జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితం సీఎం మంత్రులతో సమావేశం నిర్వహించగా దానికి భట్టి హాజరు కాలేదు. ఇప్పుడు సమావేశంలో ప్రధానంగా మున్సిపల్ ఎన్నికలు, బడ్జెట్ సమావేశాలపై కీలక అంశాలు చర్చించనున్నట్లు సమాచారం. అలాగే సీఎం అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలపైనా చర్చించే అవకాశం ఉంది.


