Mobile Popup Ad
Mobile Popup Ad

సీఎం రేవంత్ రెడ్డి కనగల్ పర్యటన వాయిదా

కలం, కనగల్ : నల్లగొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో బుధవారం జరగాల్సిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధికారిక పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. సభా ప్రాంగణంలో తలెత్తిన కొన్ని ఊహించని సాంకేతిక సమస్యల కారణంగానే ఈ పర్యటనను వాయిదా వేయాల్సి వచ్చినట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.

ముఖ్యమంత్రి బహిరంగ సభ కోసం కనగల్‌లో ఎంపిక చేసిన మైదానంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన ‘జర్మన్ హ్యాంగర్స్’ (లేటెస్ట్ టెక్నాలజీ టెంట్లు) వేసేందుకు ఇంజనీరింగ్ విభాగం ప్రయత్నించింది. అయితే, సభా స్థలి వద్ద ఉన్న భౌగోళిక పరిస్థితులు, నేల స్వభావం ఈ భారీ జర్మన్ హ్యాంగర్స్ నిర్మాణానికి అనుకూలంగా లేనట్లు నిపుణులు గుర్తించారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా భద్రత, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించిన సంబంధిత శాఖ అధికారులు.. ఇక్కడ జర్మన్ హ్యాంగర్స్ టెంట్ల ఏర్పాటు సేఫ్ కాదని తేల్చి చెబుతూ రిజెక్ట్ చేశారు.

ఈ ప్రధాన సాంకేతిక లోపం వల్లే సభ నిర్వహణకు ఇబ్బందులు తలెత్తడంతో పర్యటనను వాయిదా వేయక తప్పలేదని తెలుస్తోంది. సభా స్థలి వద్ద తలెత్తిన ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత ముఖ్యమంత్రి కనగల్ పర్యటనకు సంబంధించిన తదుపరి తేదీలను అధికారికంగా ప్రకటిస్తామని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, జిల్లా యంత్రాంగం వెల్లడించారు. పర్యటన కేవలం తాత్కాలికంగా మాత్రమే వాయిదా పడిందని, షెడ్యూల్ రద్దు కాలేదని వారు స్పష్టం చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>