epaper
Monday, February 2, 2026
spot_img
epaper

హింసను ప్రేరేపించేందుకు వైసీపీ కుట్ర : సీఎం చంద్రబాబు

కలం, వెబ్​ డెస్క్​ : రాష్ట్రంలో అలజడి సృష్టించి.. హింసను ప్రేరేపించేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్​ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) మండిపడ్డారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్సులో సీఎం పలు సూచనలు చేశారు. అధికారం కోల్పోయామన్న ఫ్రస్టేషన్​ లో వైసీపీ నేతలు రెచ్చగొట్టే చర్యలకు దిగుతుందన్నారు. ఆ పార్టీ నాయకులు చేసిన తప్పులను డైవర్ట్​ చేయడానికే ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. వైసీపీ (YCP) పన్నుతున్న ట్రాప్​ లో పడకుండా కార్యకర్తలకు మంత్రులు, పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తప్పు చేసిన ప్రతీ ఒక్కరినీ శిక్షించి తీరుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Read Also: అంబటి వ్యాఖ్యలు సభ్య సమాజం స్వాగతించదు : ఎంపీ పురందేశ్వరి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>