కలం, వెబ్ డెస్క్ : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే ( PVNR Express Highway) పై డివైడర్ ను ఢీ కొట్టి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. శంషాబాద్ వైపు నుంచి మెహదీపట్నం వైపు వస్తున్న కారు అతివేగంతో డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో హైవేపై ఇరువైపులా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు కారును తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. కాగా, అతివేగం కారణంగానే కారు డివైడర్ ను ఢీ కొట్టి పల్టీలు కొట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

