విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలి.. నిర్మల్‌లో బీజేపీ నేతల వినతి

కలం, నిర్మల్: సెప్టెంబర్‌ 17వ తేదీన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని (Telangana Liberation Day) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరుతూ బుధవారం నిర్మల్‌ (Nirmal) జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో రాథోడ్ రమేష్‌కు బీజేపీ నేతలు (BJP Leaders) వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక ఘట్టాన్ని రాష్ట్రంలో అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మేడిసెమ్మె రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నారెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, నాయకులు విజయ్, అనిల్, ధర్మాజీగారి ఈశ్వర్, దీక్షిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>