epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కార్ రేసర్​గా అజిత్​ ఎంట్రీ

కలం, వెబ్​డెస్క్​: నటుడు అజిత్​కుమార్ (Ajith Kumar) ​కు రేసింగ్​పై ఉన్న ఫ్యాషన్​ తెలిసిందే. ఇప్పటికే ఎన్నోసార్లు బైక్​ రేసింగ్​లో స్వయంగా పాల్గొన్న ఆయన ఇప్పుడు కార్​ రేసర్​గా బరిలోకి దిగనున్నారు. మలేషియాలోని సెపాంగ్​లో జరగనున్న ఏషియన్​ లీ మాన్స్​ సిరీస్​(ఏఎల్​ఎంఎస్​) ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రఖ్యాత ఎఫ్​1 రేసర్​, మనదేశానికే చెందిన నరైన్​ కార్తికేయన్​తో కలసి పోటీలో పాల్గొంటారు. ఈ నెల 13, 14న రెండ్రోజుల పాటు ఏఎల్​ఎంఎస్​ సిరీస్​ పోటీలు జరుగుతాయి. ఇందులో అజిత్​కు చెందిన ‘అజిత్​కుమార్​ రేసింగ్​’ జట్టు ‘టు కార్ ఎంట్రీ’ ఇవ్వనుంది. అంటే అజిత్​ టీమ్​ తరఫున రెండు కార్లు పోటీలో ఉంటాయి.

మొదటి కార్​కు అజిత్ (Ajith Kumar​), కార్తికేయన్​తోపాటు మరో డ్రైవర్​ జులియన్​ గెర్బి ఉంటారు. రెండో కార్​కు ఆదిత్య పటేల్​, రొమైన్​ వోజ్నియక్​ డ్రైవర్లుగా వ్యవహరిస్తారు. ఇవి ఎండ్యూరెన్స్​ పోటీలు. ఇందులో కొన్ని లాప్స్​ తర్వాత డ్రైవర్​ మారుతుంటారు. ఆ ప్రకారం కొన్ని లాప్స్​ వరకు అజిత్​ కార్​ను స్వయంగా నడపనున్నారు. రేసింగ్​లో భాగంగా ప్రస్తుతం క్వాలిఫయర్స్​ జరుగుతున్నాయి. వీటి కోసం అజిత్​ మలేషియాకు​ రావడతో ఆయన్ని చూసేందుకు, ఫొటోలు దిగేందుకు అభిమానులు క్యూ కడుతున్నారు. కాగా, ఇటీవలే ఆజిత్​ టీమ్​ దుబాయ్​ మోటో జీపీ రేస్​లో మూడో స్థానంలో నిలిచింది.

Read Also: మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు.. వారికి మాత్రమే ఛాన్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>