కలం, వెబ్ డెస్క్ : జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ (LOC) వద్ద ఉగ్రవాదుల చొరబాటును భారత సైన్యం అడ్డుకుంది. బుధవారం తెల్లవారుజామున భింబర్ గాలి ప్రాంతంలో అనుమానాస్పద కదలికలు గుర్తించినట్లు వైట్ నైట్ కార్ప్స్ వెల్లడించింది. విశ్వసనీయ గూఢచారి సమాచారంతో పాటు నిరంతర నిఘా ఆధారంగా ఉగ్రవాదుల సంచారం బయటపడినట్లు పేర్కొంది.
సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన సైనిక దళాలు తక్షణ చర్యలు చేపట్టి చొరబాటుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను ఎదుర్కొన్నాయి. సమన్వయంతో నిర్వహించిన భూ స్థాయి ఆపరేషన్ ద్వారా ఉగ్రవాదుల యత్నాన్ని పూర్తిగా భగ్నం చేసినట్లు సైన్యం తెలిపింది. నియంత్రణ రేఖ (LOC)ను దాటనీయకుండా దళాలు సమర్థంగా స్పందించాయని పేర్కొంది.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో భద్రతా బలగాలను ఏర్పాటుచేసి కట్టుదిట్టమైన నిఘా కొనసాగిస్తున్నట్లు వైట్ నైట్ కార్ప్స్ వెల్లడించింది. భూ, గగనతల నిఘా వ్యవస్థలను సమన్వయం చేస్తూ ప్రాంతంపై పట్టు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. మొత్తం సెక్టార్లో హై అలర్ట్ కొనసాగుతోందని సైన్యం పేర్కొన్నది.
Read Also: ఢిల్లీలో హోలీ వేడుకల్లో రాహుల్ గాంధీ!
Follow Us On: Instagram

