కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు, ఇరాన్ సుప్రీం అయతొల్లా ఖమేనీ ప్రస్తుతం పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధానికి కేంద్ర బిందువులు. ఇదే కాదు, వీళ్ల ముగ్గురి మధ్య మరో కామన్ పాయింట్ కూడా ఉంది(Eclipse). అది ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ విషయమేంటంటే..
అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ జ్యోతిష్కుడు క్రిస్ బ్రెన్నన్ మంగళవారం తన ‘ఎక్స్’ ఖాతాలో ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. అందులో ఇలా ఉంది..
‘‘ప్రస్తుత యుద్ధానికి కారణమైన ముగ్గురు నాయకులూ గ్రహణం రోజునే పుట్టారు.
- ట్రంప్ : జూన్ 14, 1946 – చంద్ర గ్రహణం
- నెతన్యాహు : అక్టోబర్ 21, 1949– సూర్య గ్రహణం
- ఖమేనీ : ఏప్రిల్ 19, 1939– సూర్య గ్రహణం
వీళ్లలో ఖమేనీ మరణం తర్వాత ఈ రోజు మరో గ్రహణం జరగనుంది’’ అని ట్వీట్ చేశారు.
అంతేకాదు, దీన్ని వెరిఫై చేయమని గ్రోక్ను అడిగారు. ఆశ్చర్యకరంగా గ్రోక్ సైతం ఇదే విషయాన్ని నిర్దారించింది. ఆ ముగ్గురు నాయకులూ గ్రహణం రోజే పుట్టారని తేల్చింది(Eclipse). దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలైంది. దీనిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

