epaper
Monday, March 2, 2026
epaper

సెమీస్​కు టీమిండియా.. వెస్టిండీస్​పై ఘన విజయం

కలం, స్పోర్ట్స్​ బ్యూరో: ఒకే ఒక్కడు..! పర్ఫార్మెన్స్ బాలేదన్నారు.. టీ20కి పనికిరాడన్నారు..! ఎందుకు స్క్వాడ్​లోకి తీసుకున్నారని దుమ్మెత్తిపోశారు!! కానీ, ఆ ఒక్కడే.. టీమిండియాకు నేనున్నానంటూ నిలబడ్డాడు. సెమీస్​ ఆశలు సన్నగిల్లిన టీమ్​ను ముందుండి నడిపించాడు. ప్రత్యర్థికి చెమటలు పట్టించాడు. టీమిండియాను సగర్వంగా సెమీస్​కు చేర్చి.. తానేంటో బ్యాట్​తో చూపించాడు. ఆ ఒక్కడే సంజూ శాంసన్​! కోల్​కతా వేదికగా ఆదివారం వెస్టిండీస్​తో (IND vs WI) జరిగిన సూపర్​ 8 చివరి మ్యాచ్​లో వికెట్​ కీపర్​ సంజూ తాండవం చేశాడు. తొలి ఓవర్​ నుంచి మొదలు చివరి ఓవర్​ వరకు క్రీజ్​లో ఉండి.. పరుగుల వరద పారించాడు. తనకు తోడుగా వచ్చిన టీమ్​మేట్స్​ ఒకరొకరుగా వెనుదిరుగుతున్నా ఎక్కడా తడబడలేదు. 50 బంతుల్లో 4 సిక్సర్లు, 12 బౌండరీలతో.. 97 రన్స్ చేసి టీమిండియాను సెమీస్​కు చేర్చాడు. ఇక, ఈ నెల 5న ముంబై వేదికగా ఇంగ్లండ్​తో టీమిండియా సెమీ ఫైనల్​లో తలపడనుంది. స్వదేశంలో ఏ టీమ్​ కూడా టీ20 వరల్డ్​ కప్​ కొట్టిన చరిత్ర లేదు. ఇప్పుడు టీమిండియాకు ఆ హిస్టరీని సొంతం చేసుకునే చాన్స్​ రెండడుగుల దూరంలో ఉంది. సెమీస్​లో గెలిస్తే.. మార్చి 8న ఫైనల్​!!

కలం 360 డిగ్రీస్ స్పెషల్ కథనం చదివేందుకు కింద ఉన్న ఇమేజ్ పై క్లిక్ చేయండి.

IND vs WI
IND vs WI

Read Also: గల్ఫ్ లో హై టెన్షన్.. తెలంగాణ వలసజీవులు బిక్కుబిక్కు

Follow Us On: Youtube

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!