కలం, వెబ్ డెస్క్: వాటర్ ట్యాంకుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే డయేరియా విజృంభిస్తోందని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) విమర్శించారు. రాష్ట్రంలో పలు చోట్ల డయేరియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేడు శాసన మండలిలో ఆయన మాట్లాడారు. వాటర్ ట్యాంకుల నిర్వహణ బాధ్యత ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తామని, సదరు వ్యక్తులు పట్టించుకోకపోవడం వల్ల పరిశుభ్రత లోపించి డయేరియా ప్రబలుతోందన్నారు. వాటర్ పైప్ లైన్లు, ట్యాంకుల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. వాటర్ ట్యాంకుల పరిస్థితిని తరచూ పర్యవేక్షిస్తూ ఉండాలని కోరారు.
Read Also: 30వేల లంచం.. 4 కోట్ల నగదు : అధికారి షాకింగ్ స్టోరీ
Follow Us On : WhatsApp

