కలం, డెస్క్ : తెలంగాణ క్యాబినెట్ (TG Cabinet) కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి హైదరాబాద్ మొదటిదశ మెట్రోను పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయించింది. దీనికి సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు జారీ కాబోతున్నాయి. ఈ నిర్ణయంతో హైదరాబాద్ మెట్రో పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి రాబోతోంది. మెట్రోను గడువులోగా స్వాధీనం చేసుకోడానికి కావాల్సిన నిధుల సమీకరణ, ఇతర ప్రయోజనాల గురించి ఇప్పటికే మంత్రి వర్గ ఉపసంఘం చర్చలు జరిపింది. ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులతో కూడా మాట్లాడి ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.


