కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) జిల్లా పరిధిలోని కాకతీయ వర్సిటీ సమీపంలో దారుణ ఘటన జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ అతడి స్నేహితుడిపై కత్తితో దాడి చేశాడు. భూ వివాదం నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండలోని 4వ డివిజన్ కార్పొరేటర్ అశోక్, కృష్ణ కాలనీకి చెందిన లక్ష్మణ్ మిత్రులు. భూమి విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం అశోక్, లక్ష్మణ్తో మరోసారి గొడవ పడ్డాడు. మాటా మాటా పెరిగి అశోక్ తన వద్ద ఉన్న కత్తితో లక్ష్మణ్పై దాడిచేసి గాయపరిచాడు. సమాచారమందుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రిలో చేర్పించారు.


