కలం, వెబ్ డెస్క్: యువ క్రికెటర్ ఆయుష్ మాథ్రే (Ayush Mhatre) కు క్రికెట్ గాడ్ సచిన్ సూపర్ గిఫ్ట్ ఇచ్చారు. తన అంతర్జాతీయ కెరీర్ చివరి టెస్టు సిరీస్లో ధరించిన జెర్సీని సచిన్ యువ కెప్టెన్కు అందించారు. భారత్ అండర్-19 ప్రపంచకప్ను (U19 WC) గెలిచిన కొన్ని రోజులకే ఈ భేటీ జరిగింది. హరారేలో జట్టును ఆరో టైటిల్కు నడిపించిన అయుష్ను సచిన్ ప్రత్యేకంగా కలిశారు. ఇది ఒక తరం నుంచి మరో తరానికి బాధ్యతలు అప్పగించినట్టుగా క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. 2026 అండర్-19 ప్రపంచకప్లో అయుష్ 214 పరుగులు చేశాడు. మూడు అర్ధశతకాలు నమోదు చేశాడు. ముంబయి నుంచి వచ్చిన ఈ బ్యాటర్ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నాడు.
జెర్సీ అందుకున్న క్షణం తనకు కలలాంటిదని అయుష్ (Ayush Mhatre) భావం వ్యక్తం చేసినట్టు సమాచారం. సచిన్ (Sachin Tendulkar) ప్రయాణంలో భాగమైన జ్ఞాపకాన్ని జీవితాంతం గౌరవంతో మోస్తానని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది. సచిన్, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లు ముంబయి క్రికెట్ను మలిచిన తరంలో ఇప్పుడు అయుష్ పేరు వినిపిస్తోంది. యువ నాయకుడి భవిష్యత్తుపై ఆసక్తి పెరుగుతోంది. ఇదిలా ఉండగా, ప్రపంచకప్ విజేత జట్టు ముంబయికి చేరుకోగా అభిమానులు ఘన స్వాగతం పలికారు. అయుష్తో పాటు వైభవ్ సూర్యవంశీ, అభిజ్ఞాన్ కుందు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Read Also: ట్రోల్స్పై అల్లు అర్జున్ టీమ్ స్ట్రాంగ్ రియాక్షన్
Follow Us On: Instagram


