కలం, వెబ్డెస్క్: జమ్మూకశ్మీర్లో (Jammu Kashmir) జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు తీవ్రవాదులను భారత భద్రతా దళాలు మట్టుబెట్టాయి (Kashmir Encounter). మృతుల్లో జైషే టాప్ కమాండర్తోపాటు మరో టెర్రరిస్ట్ ఉన్నట్లు గుర్తించారు. దీనిపై భారత భద్రతా దళాలు చెప్పిన వివరాల ప్రకారం.. తీవ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల సమాచారం మేరకు స్థానిక పోలీసులతో కలసి ఆర్మీ, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా ‘ఆపరేషన్ కియా’ చేపట్టాయి.
బసంత్గఢ్లోని జోపార్ అటవీ ప్రాంతాలో మంగళవారం సాయంత్రం0సెర్చింగ్ మొదలుపెట్టాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం దళాలను చూసిన టెర్రరిస్ట్లు కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన దళాలు వెంటనే ఎదురుకాల్పులు మొదలుపెట్టాయి. ఈ క్రమంలో ఇద్దరు టెర్రరిస్ట్లను భారత దళాలు మట్టుబెట్టాయి (Kashmir Encounter). ఇంకా తీవ్రవాదులెవరైనా దాగి ఉన్నారేమోనని ‘ఆపరేషన్ కియా’ దళాలు కొనసాగిస్తున్నాయి.
Read Also: మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత
Follow Us On : WhatsApp


