కలం, స్పోర్ట్స్ : టీ20 ప్రపంచకప్ 2026లో భారత్తో మ్యాచ్ ఆడబోమన్న పాకిస్తాన్ నిర్ణయం ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. ఐసీసీ (ICC) వెంటనే స్పందిస్తూ, “ఎంపికగా పాల్గొనడం” తీవ్ర ప్రభావాలు చూపొచ్చని పీసీబీకి గట్టి హెచ్చరిక చేసింది (PCB) . ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలో జరిగే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్తో ఆడాల్సి ఉంది. అయితే ఆదివారం పాకిస్తాన్ ప్రభుత్వం టోర్నీలో పాల్గొంటామని కానీ భారత్తో మ్యాచ్ ఆడబోమని ప్రకటించింది.
దీనిపై ఐసీసీ, పీసీబీ (ICC – PCB) నుంచి ఇంకా అధికారిక సమాచారం అందలేదని తెలిపింది. ప్రపంచ టోర్నీలో అన్ని జట్లు షెడ్యూల్ ప్రకారం సమానంగా పోటీ పడాల్సిందే అన్నదే ప్రాథమిక సూత్రమని గుర్తు చేసింది. క్రీడా నైతికత, న్యాయం, సమానత్వంపై ఐసీసీ టోర్నీలు నిలబడతాయని, ఒక ప్రత్యర్థిని మాత్రమే తిరస్కరించడం పోటీ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని హెచ్చరించింది. ఈ నిర్ణయం క్రికెట్కు, అభిమానులకు అనుకూలం కాదని ఐసీసీ పేర్కొంది. దీర్ఘకాలంలో పాకిస్తాన్ క్రికెట్పై ప్రభావం పడొచ్చని పీసీబీ ఆలోచించాలని సూచించింది.
పాకిస్తాన్ గ్రూప్-Aలో భారత్, నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్ఏతో ఉంది. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్తో తొలి మ్యాచ్, ఫిబ్రవరి 10న యూఎస్ఏతో, ఫిబ్రవరి 18న నమీబియాతో ఆడాల్సి ఉంది. మొత్తానికి, ఈ అంశంపై పీసీబీ అధికారిక స్పందన ఇంకా రావాల్సి ఉంది. టోర్నీ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అన్ని పక్షాలు పరిష్కారం వెతుకుతాయని ఐసీసీ ఆశిస్తోంది.
Read Also: కోహ్లీని దాటేసిన బాబర్ అజామ్.. ఎందులో అంటే..
Follow Us On: Sharechat


