కలం, వెబ్ డెస్క్: 2026-27 కేంద్ర బడ్జెట్లో (Union Budget 2026) ఆయుర్వేదం, ఆయుష్ రంగానికి కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతనిచ్చింది. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదానికి పెరిగిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని, ఇండియాను ‘గ్లోబల్ వెల్నెస్ హబ్’గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్మలమ్మ (Nirmala Sitharaman) కీలక ప్రకటనలు చేశారు. దేశంలో ఆయుర్వేద విద్య, పరిశోధన విస్తరించడానికి 3 కొత్త ఆలిండియా ఆయుర్వేద సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వెల్నెస్, యోగా సేవలలో పెరిగిన అంతర్జాతీయ డిమాండ్ను అందుకోవడానికి.. 1.5 లక్షల మంది కేర్ గివర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆయుష్ ఫార్మసీలు, డ్రగ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలను అప్గ్రేడ్ చేయనున్నారు.
Read Also: కేంద్ర బడ్జెట్పై రాహుల్ గాంధీ రియాక్షన్.. దేశ సంక్షోభాన్ని పట్టించుకోలేదని ఫైర్!
Follow Us On: Pinterest


