కలం, డెస్క్ : మాజీ సీఎం కేసీఆర్ (KCR) నేడు నందినగర్ లో సిట్ విచారణ ఎదుర్కుంటున్నారు. ఈ క్రమంలోనే మధ్యాహ్న భోజన సమయంలో కేసీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ‘తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోశా. ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ ఎదురక్కోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. రాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. ఇదే గదిలో ఎంతో మందితో చర్చలు పరిపా. ఈ గదిలోనే తెలంగాణ రాష్ట్ర కోసం వ్యూహ రచన చేశా. ఇప్పుడు ఇదే గదిలో విచారణ ఎదుర్కోవడం దురదృష్టకరం’ అంటూ ఎమోషనల్ అయ్యారు కేసీఆర్. నందినగర్ ఇంట్లోని రెండో అంతస్తులో ఓ గదిలో కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రస్తుతం విచారిస్తున్నారు.
Read Also: ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి కోటి ఆర్థిక సాయం
Follow Us On: Pinterest


