epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు భారీ ఊతం

కలం, వెబ్ డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ (Budget)లో దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (SME / MSME) భారీగా ఊతం కల్పించారు. పాత పరిశ్రమ క్లస్టర్ల పునరుద్ధరణ, క్రెడిట్ ప్రవాహాన్ని బలోపేతం చేసేలా బడ్జెట్లు కేటాయింపులు చేశారు. చిన్న పరిశ్రమలకు మూలధనం, మార్కెట్లు, బకాయిల వసూలు విధానాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ చర్యలు రూపొందించారు.

దేశవ్యాప్తంగా 200 పాత పరిశ్రమ క్లస్టర్ల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని ప్రారంభించనుంది. రుణ ఒత్తిళ్లు, పాత సాంకేతికత కారణంగా క్షీణించిన సంప్రదాయ పరిశ్రమ కేంద్రాల్లో మళ్లీ ఉపాధి సృష్టించడం, తయారీ రంగాన్ని పునరుజ్జీవింపజేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం కావడం గమనార్హం.

అధిక సామర్థ్యం ఉన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలను విస్తరించేందుకు రూ.10,000 కోట్ల ఎస్‌ఎంఈ గ్రోత్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు బడ్జెట్​ (Budget) ప్రసంగంలో ప్రకటించారు. ఉత్పాదకత, ఫార్మలైజేషన్‌, ఎగుమతులకు సిద్ధత వంటి ప్రమాణాలు పాటించే పరిశ్రమలకు ప్రోత్సాహక పథకాలతో పాటు ఈ ఫండ్ పనిచేస్తుంది.

అత్యంత చిన్న పరిశ్రమలకు ఊతంగా సెల్ఫ్-రిలయంట్ ఇండియా ఫండ్‌కు అదనంగా రూ.2,000 కోట్లు కేటాయించారు. క్రెడిట్ గ్యారంటీ పథకాలు ఉన్నప్పటికీ మూలధన కొరతతో ఇబ్బంది పడుతున్న మైక్రో ఎంటర్‌ప్రైజ్‌లకు ఇది దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

వాణిజ్య ఫైనాన్స్ వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేసే దిశగా కూడా బడ్జెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఈ-మార్కెట్‌ప్లేస్‌ను ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్‌తో అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా ఎంఎస్‌ఎంఈ సరఫరాదారులకు చెల్లింపుల చక్రంపై స్పష్టత లభిస్తుంది.

Read Also: బాలికలకు గుడ్ న్యూస్.. బడ్జెట్‌లో కీలక కేటాయింపులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>