epaper
Sunday, February 1, 2026
spot_img
epaper

తిరుపతిలో నడిరోడ్డుపై కత్తులతో మందుబాబుల హల్​చల్​..

కలం, వెబ్​ డెస్క్​ : ఆధ్యాత్మిక నగరం తిరుపతి (Tirupati) లో మందుబాబులు హల్​చల్ చేశారు. నడి రోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు. కేశవాయనగుంటలో రోడ్డుపైనే కారు ఆపి మందు తాగుతూ ట్రాఫిక్​ కు తీవ్ర అంతరాయం కలిగించారు. కారు పక్కకు తీయుమని చెప్పినందుకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్​ అయి ఇంటికి వెళ్తున్న రోగి కుటుంబ సభ్యులపై దురుసుగా ప్రవర్తించారు. అంతటితో ఆగకుండా వాళ్లపూ మందుబాబులు కారు ఎక్కించారు. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>