కలం, తెలంగాణ బ్యూరో: ఈసారి బడ్జెట్ (Union Budget 2026) వెరీ స్పెషల్. సెలవు దినమైన ఆదివారం పార్లమెంట్ ముందుకు చిట్టా పద్దు రానుంది. ఆదివారం బడ్జెట్ ను ప్రవేశపెట్టడం దేశ ఆర్థిక చరిత్రలో ఇదే తొలిసారి. 2017 నుంచి మోదీ సర్కార్ బడ్జెట్ తేదీని ఫిబ్రవరి 1కి మార్చడంతో.. ఈసారి వారం పరంగా ఆదివారం ప్రవేశపెట్టాల్సిన సందర్భం ఏర్పడింది. ఉదయం 11 గంటలకు పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను టేబుల్ చేయనున్నారు. బడ్జెట్ ఎక్కువ సార్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా ఇప్పటికే రికార్డులకెక్కిన ఆమె.. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి వ్యక్తిగా కూడా రికార్డు సొంతం చేసుకోనున్నారు.
Read Also: నిందితులను పట్టుకుంటాం.. కోఠి ఘటనపై సజ్జనార్ రియాక్షన్
Follow Us On: Sharechat


