కలం, వెబ్ డెస్క్ : త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు (Municipal Elections) మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఇన్ చార్జులను నియమించింది బీఆర్ఎస్ . 122 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఇన్ చార్జులను నియమించినట్టు కేటీఆర్ (KTR) ప్రకటించారు. వీరంతా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల పూర్తి బాధ్యతను తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక, రెబల్స్ ను బుజ్జగించడం, ప్రచార బాధ్యతలు, ఎన్నికల వ్యూహాలు, బూత్ లెవల్ ఏజెంట్లను నియమించడం లాంటివన్నీ వీరే చూసుకుంటారు. వీరు త్వరలోనే వారికి అప్పగించిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆశావహుల లిస్టును, తాజా నివేదికలను పార్టీ అధిష్టానానికి పంపిస్తారు.
ఏ అభ్యర్థులకు ప్రజల్లో సానుకూలత ఉందనేది కూడా వీరే నివేదికలో తెలియజేస్తారు. ఎన్నికలు (Municipal Elections) ముగిసే వరకు వీరు ఆయా మున్సిపాలిటీల పరిధిలోనే ఉండబోతున్నారు. ఎప్పటికప్పుడు స్థానిక రాజకీయ పరిస్థితులను కేటీఆర్ కు వివరిస్తూ.. సమన్వయం చేసుకుంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ రూపొందించిన ప్రచార అస్త్రాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం.. అధిష్టానం ఆదేశాలను అమలు పరచడంలో వీరిదే ప్రధాన బాధ్యత అంటున్నారు పార్టీ శ్రేణులు.
Read Also: ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్ సంచలన నివేదిక
Follow Us On: Sharechat


