epaper
Tuesday, January 20, 2026
spot_img
epaper

‘మెట్రో ఫేజ్​–2’ ను ఆమోదింపజేయండి.. కిషన్​ రెడ్డికి సీఎం రేవంత్​ రెడ్డి లేఖ

కలం, వెబ్​ డెస్క్​ : పెండింగ్​ లో ఉన్న మెట్రో ఫేజ్​ – 2 (Metro Phase 2) ప్రాజెక్టును పలుకుబడిని ఉపయోగించి వీలైనంత త్వరగా ఆమోదింపజేయాలని సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy).. కేంద్రమంత్రి కిషన్​ రెడ్డికి (Kishan Reddy) లేఖ రాశారు. హైదరాబాద్​, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని త్వరగా నిర్ణయం తీసుకోవాలని లేఖలో సీఎం విజ్ఞప్తి చేశారు.

మెట్రో ఫేజ్​ –2 మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం చర్యలు జరుపుతుందని పేర్కొన్నారు. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి కలిసినప్పుడు జరిగిన చర్చలపై కిషన్​ రెడ్డికి లేఖలో రేవంత్​ రెడ్డి వివరించారు. మెట్రో మంజూరును వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనకు అనుగుణంగా సీఎస్​, హెచ్​ఎంఆర్​ఎల్ ఎండీని నామినేట్ చేస్తూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.

సంయుక్త కమిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం వేచి చూస్తున్నామని జనవరి 15న కిషన్​ రెడ్డికి రాసిన లేఖను రేవంత్​ రెడ్డి ప్రస్తావించారు. కమిటీ కూర్పుపై ఇప్పటికే కేంద్రానికి తెలియజేశామన్నారు. ఎంతో కాలం పెండింగ్​ లో ఉన్న మెట్రో ఫేజ్​ – 2 (Metro Phase 2) ప్రాజెక్టు కు మీ పలుకుబడిని ఉపయోగించి త్వరితగతిన ఆమోదింపజేయాలని కిషన్​ రెడ్డికి రాసిన లేఖలో సీఎం రేవంత్​ రెడ్డి అభ్యర్థించారు.

Read Also: ఏఐతో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యం : సీఎం రేవంత్​ రెడ్డి

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>