కలం, నల్లగొండ బ్యూరో: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లాలో పులి సంచారం (Tiger Movement) కలకలం రేగింది. రాజపేట,తుర్కపల్లి మండలాల్లో పులి జాడలు కనిపించడంతో ప్రజల్లో తీవ్ర అభ్యంతరం నెలకొన్నాయి. రాజపేట (మం)బేగంపేట గ్రామ పరిసరాల్లోని ఓ రైతు పొలంలో పులి అడుగులు ప్రత్యక్షం అయ్యాయి. గత రాత్రి జిల్లా తుర్కపల్లి (మం)బస్వాపూర్ గ్రామ శివారులో పులి కనిపించింది. పులి కదలికలను ఓ స్థానికుడు మొబైల్లో బంధించారు. ప్రజలు అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు పులి సంచారం నిజమేనని నిర్ధారించారు. రైతులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పులి జాడ కోసం అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
Read Also: నేటి నుండి కొమురవెళ్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు
Follow Us On: Sharechat


