కలం, నిజామాబాద్ బ్యూరో : వారసత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట ఎమ్మార్వో శ్రీనివాస్ (MRO caught by ACB). ఓ రైతు అనువంశికంగా వచ్చిన భూమిని తన పేరుపై పట్టా చేయించుకోవడానికి తహసీల్దారు కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పట్టా మార్పిడి చేయడానికి తహసీల్దార్ శ్రీనివాస్ రూ.50వేలు డబ్బు డిమాండ్ చేశారు. ఈ విషయమై రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ పంపిన డబ్బును తీసుకెళ్లగా ఎమ్మార్వో శ్రీనివాస్ తన అసిస్టెంట్ అయిన ప్రైవేట్ ఉద్యోగి అజయ్ను సంప్రదించాలని చెప్పారు. తహసీల్దార్ సూచన మేరకు అజయ్కి డబ్బులు ఇవ్వడంతో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు దాడి చేసి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం డబ్బులు ఇవ్వొద్దని, ఎవరైనా అధికారులు లంచం అడిగితే ఏసీబీ ని ఆశ్రయించాలని డీఎస్పీ శేఖర్ గౌడ్ ప్రజలకు సూచించారు.

Read Also: స్కూల్లో ఫుడ్ పాయిజన్.. విద్యార్థులకు అస్వస్థత
Follow Us On: Youtube


