కలం, వెబ్ డెస్క్: కాసేపటిక్రితమే తన ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender)పై రాష్ట్ర హైకోర్టు వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన అనుచరులతో భవిష్యత్ కార్యాచరణపై దానం సమావేశమయ్యారు. హైకోర్టు వేటు వేయడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అటు న్యాయనిపుణులతోనూ దానం సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. కాగా, దానం తదుపరి నిర్ణయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

