కలం, వెబ్ డెస్క్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Modi – Putin) ద్వైపాక్షిక సమావేశంలో భారత్-రష్యా ఆర్థిక భాగస్వామ్యాన్ని విస్తరించడంపై కీలక అంశాలపై చర్చలు చేపట్టారు. శుక్రవారం న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ సదస్సు (BRICS Summit)లో పాల్గొనేందుకు వచ్చిన పుతిన్ తో మోదీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యం కీలక అంశంగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని భారత్, రష్యా లక్ష్యంగా పెట్టుకున్నాయి. అలాగే, రష్యా పెట్టుబడులను పెంచాలని, భారత ఉత్పత్తులకు మార్కెట్ ను విస్తరించాలని భారత ప్రభుత్వం కోరుకుంటోంది. రెండు దేశాల కంపెనీల మధ్య కొత్త బిజినెస్-టు-బిజినెస్ అవకాశాలను సృష్టించే లక్ష్యంతో ఉన్న ఇన్నోప్రోమ్ ఇండియా ద్వారా సహా, పారిశ్రామిక సహకారాన్ని మరింతగా పెంపొందించే మార్గాలను ఈ భేటీలో మోదీ, పుతిన్ సమీక్షించే అవకాశం ఉన్నట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
ప్రధాని మోదీ, పుతిన్ (Modi – Putin) చర్చలలో పారిశ్రామిక సహకారం మరో ముఖ్యమైన స్తంభంగా ఉంటుందని భావిస్తున్నారు. ఐరన్ ట్రాన్స్ పోర్ట్, రైల్వే రంగం, సొరంగ మార్గాల నిర్మాణం, మౌలిక సదుపాయాల రంగాలలో మరింత సహకారాన్ని పెంపొందించుకునేందుకు ఇరుదేశాలు కీలకంగా చర్చించే అవకాశం ఉంది.
Also Read : ఇకపై టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేదు.. ఫిబ్రవరి నుంచి కొత్త డిజిటల్ విధానం
Follow Us On : WhatsApp

