కలం, వెబ్డెస్క్: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు సాయంత్రం వరకు హైదరాబాద్కు రానున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు చేరుకున్న వెంటనే అక్కడి నుంచి నేరుగా నల్లగొండ ఎక్స్ రోడ్డులో ఉన్న చంచల్గూడ-సంతోష్ నగర్ స్టీల్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి బయలుదేరనున్నారు. అనంతరం చంచల్ గూడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరు కానున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం రేవంత్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

