కలం, వెబ్ డెస్క్: అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో కర్ణాటక మంత్రి నాగేంద్ర (Minister Nagendra) తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. బీజేపీ రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశాడు. రాజకీయంగా తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని, అందుకే రాజీనామా చేశానని అన్నారు. నాగేంద్ర రాజీనామా వ్యవహారం కర్ణాటక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

