కలం, నిర్మల్ : రాఖీ పండగ (రక్షాబంధన్) సందర్భంగా నిర్మల్ జిల్లా ప్రజలందరికీ కలెక్టర్(Nirmal Collector) భవేష్ మిశ్రా (Bhavesh Mishra) హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయతకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ పండుగ మహిళలకు రక్షణ, గౌరవం కల్పించాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి పండుగను సంతోషంగా, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. ఈ రాఖీ పండగ ప్రతి కుటుంబంలో ప్రేమ, ఆప్యాయతలను మరింత పెంపొందించాలని.. ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకాంక్షించారు.

