కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ దర్శకుడు పవన్ సాధినేని (Pavan Sadineni) చిక్కుల్లో పడ్డారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ నటి గాయత్రి గుప్తా ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’, ‘సేనాపతి’ చిత్రాలతో పాటు ‘దయా’ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవన్ సాధినేనిపై సదరు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

