చెత్త కుప్ప‌లో చాక్లెట్లు.. ఎగ‌బ‌డి తీసుకెళ్లిన జ‌నం!

క‌లం, వెబ్‌డెస్క్‌: చెత్త కుప్ప‌లో ఉన్న చాక్లెట్లను జ‌నం ఎగ‌బ‌డి మ‌రీ తీసుకెళ్తున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్ ప్ర‌దేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని కాన్పూర్ మున్సిప‌ల్‌లో జ‌రిగింది. డేట్ అయిపోయిన చాక్లెట్ల‌ (Expired Chocolates)ను ఓ ఫ్యాక్ట‌రీ య‌జ‌మాని చెత్త‌కుప్ప‌లో ప‌డేశాడు. ఈ విష‌యం తెలుసుకున్న స్థానికులు భారీ సంఖ్య‌లో అక్క‌డికి చేరుకున్నారు. అస‌లు ఆ చాక్లెట్ల‌ను ఎందుకు చెత్త‌కుప్ప‌లో ప‌డేశార‌ని ఆలోచించ‌కుండా డ‌బ్బాల‌న్నీ సంచుల్లో నింపుకోవ‌డం కోసం ఎగ‌బ‌డ్డారు. చ‌దువుకున్న వాళ్లు సైతం పోటీ ప‌డి తీసుకెళ్లారు. సోష‌ల్ మీడియాలో ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. ఎక్స్‌పైర్డ్ చాక్లెట్ల‌ను ఎగ‌బ‌డి మ‌రీ తీసుకెళ్ల‌డంపై నెటిజ‌న్లు షాక‌వుతున్నారు. ఈ చాక్లెట్ల‌ను చిన్న పిల్ల‌ల‌కు తినిపిస్తే ఎలా ? అని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక ఈ ఘ‌ట‌న‌పై వెస్ట్ జోన్ డీసీపీ ఖాసిమ్ అబిది స్పందించారు. డేట్ అయిపోయిన చాక్లెట్లు, లేదా ఇత‌ర తినుబండార‌ల‌ను తింటే ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌ని చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై త‌క్ష‌ణ‌మే విచార‌ణ జ‌రిపి చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. దీనిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసి, చాక్లెట్ల‌ను అక్క‌డ ప‌డేసిన కంపెనీ యాజ‌మాన్యాన్ని విచారిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>