కలం, వెబ్ డెస్క్: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (YS Jagan) నేడు పార్టీ ముఖ్య నేతలో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉ. 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రీజనన్ కోఆర్డనేటర్లు, జిల్లా అధ్యక్షులు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీలు పాల్గొననున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ భేటీలో వైఎస్ జగన్ చర్చించనున్నారు. అలాగే పార్టీ క్యాడర్ ను బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడం, సర్ ప్రక్రియ తదితర అంశాలపై పార్టీ శ్రేణులకు వైఎస్ కీలక ఆదేశాలు జారీ చేయనున్నారు.

