కలం, వెబ్డెస్క్: హైదరాబాద్లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు (Sandhya Theatre Stampede Case) పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న స్టార్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు. గతంలో కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో అల్లు అర్జున్ నేడు స్వయంగా విచారణకు హాజరయ్యారు.
సంధ్య థియేటర్లో పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా సోమవారం నాంపల్లి కోర్టులో వాదనలు కొనసాగగా, తదుపరి విచారణను సెప్టెంబర్ 1కి వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

