ఢిల్లీలో BWF పోరు: గేమ్‌ను మార్చేస్తున్న వెదర్!

క‌లం, వెబ్‌డెస్క్‌: న్యూఢిల్లీ వేదికగా సోమవారం నుంచి ప్రతిష్టాత్మక బీడబ్ల్యూఎఫ్ (BWF) ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ ప్రారంభం కానున్నాయి. ప్రపంచ స్థాయి దిగ్గజ ప్లేయర్లంతా ఇప్పటికే భారతదేశానికి చేరుకున్నారు. అయితే ఈసారి గెలుపోటములను కేవలం ఆటగాళ్ల నైపుణ్యమే కాకుండా వాతావరణ పరిస్థితులు కూడా శాసించనున్నాయి. ఢిల్లీలో వర్షాలు కురుస్తుండటంతో వాతావరణంలో తేమ 70 నుండి 90 శాతం వరకు నమోదువుతోంది. మరోవైపు పావురాలను అదుపు చేసేందుకు ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేక నాన్-టాక్సిక్ జెల్ ఏర్పాటు చేశారు. ఈ జెల్ కరగకుండా ఉండేందుకు ఏసీల వాడకాన్ని పెంచాల్సి వస్తోంది. దీనివల్ల కోర్టులో వీచే గాలి (డ్రిఫ్ట్) షటిల్ కాక్ వేగాన్ని, దిశను మార్చేస్తోంది.

ముఖ్యమైన మైదానంతో పాటు కేడీ జాధవ్ స్టేడియంలోనూ ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించారు. కొందరు ఆటగాళ్లకు గాలి తీవ్రత ఎదురవ్వగా, మరికొందరు స్వల్ప మార్పులను గమనించారు. జనవరిలో జరిగిన ఇండియా ఓపెన్‌తో పోలిస్తే ఇక్కడి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని ఒక చైనా డబుల్స్ ప్లేయర్ పేర్కొన్నారు. టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత చెన్ యు ఫెయ్ ఇంకా కోర్టును పూర్తిస్థాయిలో పరిశీలించలేదని చెప్పారు. ప్రాక్టీస్ పూర్తి చేశానని, కోర్టులో స్వల్పంగా గాలి వీస్తోందని వరల్డ్ నంబర్ 3 వాంగ్ జీ ఈ తెలిపారు. ఈ పరిస్థితులకు వీలైనంత త్వరగా అలవాటు పడాల్సి ఉందన్నారు.

ఏసీ లేదా వెంటిలేషన్ వల్ల వచ్చే చిన్నపాటి గాలి కూడా షటిల్ కాక్ ప్రయాణాన్ని దారి మళ్లిస్తోంది. దీనివల్ల స్మాష్‌లు, లిఫ్ట్‌లు, డ్రాప్ షాట్‌లు ఆడేటప్పుడు ఆటగాళ్లు తమ శైలిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఉష్ణోగ్రత, తేమ కారణంగా గాలి సాంద్రత మారి షటిల్ వేగం హెచ్చుతగ్గులకు గురవుతోంది. ఇది ప్లేయర్లను త్వరగా అలసిపోయేలా చేస్తోంది. అయితే అందరు ఆటగాళ్లూ ఫిర్యాదు చేయడం లేదు.

ప్రపంచ 7వ ర్యాంకర్ లీ షిఫెంగ్ మాట్లాడుతూ.. గతంతో పోలిస్తే స్టేడియం నిర్వహణ, కోర్టు పరిమాణం, వాతావరణ నియంత్రణ చాలా బాగున్నాయని నిర్వాహకులను ప్రశంసించారు. ఏది ఏమైనా, ఈ ఛాంపియన్‌షిప్‌లో షాట్ల వేగంతో పాటు స్టేడియంలోని ఉష్ణోగ్రత, గాలి ప్రభావం కూడా విజేతలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>