కలం, వెబ్డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రతి ఏటా నిర్వహించ తలపెట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు కేబినెట్ ఆమోదం లభించింది. అలాగే క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు భూ కేటాయింపులను కూడా ఆమోదించారు. రాష్ట్ర వ్యాప్తంగా నూతన కాంగ్రెస్ కార్యాలయాల కోసం భూ కేటాయింపులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శనివారం పంపిణీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డుల గురించి మంత్రి వర్గం చర్చించింది. మెట్రో రైలు విస్తరణ, నిషేధిత భూముల వ్యవహారంపై కీలక చర్చలు జరిగాయి.

