కలం, కరీంనగర్ బ్యూరో: బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సాయిని మల్లేశం (Sayini Mallesham) మొదటిసారిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సాయిని మల్లేశంని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అభినందించారు
జిల్లాలో పార్టీ బలోపేతానికి, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని బండి సంజయ్ సూచించారు . ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, కార్పొరేటర్లు ఎన్నం లక్ష్మీ ప్రకాష్, గాజ రమ శివరాం, కర్రే పద్మ అనిల్, సీనియర్ నాయకులు గుజ్జ శ్రీనివాసరావు, గుంజేటి శివ, గాధగోని రమేష్ తదితరులు పాల్గొన్నారు.

