పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు(Polavaram Project)కు సంబంధించిన నిధుల విడుదల, పురోగతిపై కేంద్రం స్పష్టతనిచ్చింది. పోలవరం ఫేజ్-1 పూర్తికి మరో ఏడాది గడువు పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టత నిచ్చింది. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ ఆర్ . కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖీత పూర్వక జవాబిచ్చారు.

ఈ సందర్భంగా 41.15 మీటర్ల నీటిమట్టం స్థాయికి సంబంధించిన పోలవరం ప్రాజెక్టు ఫేజ్ – 1 పూర్తికి సవరించిన అంచనా వ్యయం రూ.30,436.95 కోట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలిపారు. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2021-26) కేంద్రం మొత్తం రూ.12,620.53 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ఫేజ్ – 1 పనులను తొలుత మార్చి 2026 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ఇప్పుడు దానికి అదనంగా మరొక ఏడాది గడువు పెంపు నిబంధనను కూడా కల్పించినట్లు వివరించారు.

Also Read : ‘గోవింద’ నామాలను అపహాస్యం చేస్తే ఊరుకోం: పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>