కలం, నిజామాబాద్ బ్యూరో: స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తితో దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (MLA Dhanpal ) పిలుపునిచ్చారు. సోమవారం నిజామాబాద్ లోని మిర్చి కంపౌండ్ లో గల తమ ఇంటిపై జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగిందన్నారు.
Also Read : కృష్ణా తీరంలో వరుణ యాగం.. సీఎం దంపతుల ప్రత్యేక పూజలు
Follow Us On : WhatsApp

