కలం, వెబ్డెస్క్: ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తిరుమలలో నేడు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. పాండ్యాతో పాటు ఆయన ప్రియురాలు మహికా శర్మ కూడా స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిద్దరూ శనివారం రాత్రే తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున హార్దిక్ పాండ్యా స్వామి వారికి తల నీలాలు సమర్పించిన అనంతరం సుప్రభాత సేవలో స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పాండ్యా జంటకు స్వాగతం పలికారు. పండితులు వేదాశీర్వచనం అందించారు.

