నిర్మల్‌ లో విద్యుత్ సేవలపై సమీక్ష

కలం, నిర్మల్‌ : తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ చీఫ్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) రౌతు చరణదాస్ నిర్మల్ (Nirmal) జిల్లా కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలని, విద్యుత్ బిల్లుల సకాల చెల్లింపుల కోసం సంస్థ ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్‌ఈ సుభాష్, డీఈ నాగరాజు, ఎస్‌ఏఓ దిగంబర్, ఏఓ రమేశ్, ఏడీఈ శ్రీనివాసరావు, ఏఏఓలు ప్రతాప్, మధుకర్, ఏఈలు సంజీవ్, రాజ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: నత్తనడకన ‘సర్’.. మిగిలింది ఆరు రోజులే!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>