కలం, వరంగల్ బ్యూరో : కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి కర్నాటి ప్రతాప్ రెడ్డి (VC Pratap Reddy) మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ (గుండెపోటు) కు గురయ్యారు. దీంతో ఆయన్ని హనుమకొండ సుబేదారిలోని రోహిణి ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు యాంజియోగ్రామ్ తో పాటు ఇతర గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించి స్టంట్ అమర్చినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అంటున్నారు. వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
Read Also: కేంద్రంపై యువతలో తీవ్ర వ్యతిరేకత: కేటీఆర్
Follow Us On : WhatsApp

