అలర్ట్.. ఐటీ కంపెనీలకు పోలీసులు కీలక సూచనలు

కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Rain Alert) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ట్రాఫిక్ అడ్వైజరీ విడుదల చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రోడ్లపై తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశముండటంతో అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు సైబరాబాద్ పరిధిలోని ఐటీ కంపెనీలు, సంస్థలు ఉద్యోగులను ముందుగానే కార్యాలయాల నుంచి పంపించాలని సూచించారు.

ఉద్యోగుల భద్రత, రహదారులపై ఒత్తిడి తగ్గించడం, ట్రాఫిక్‌ను సమర్థంగా నిర్వహించడం లక్ష్యంగా ఈ సూచనలు జారీ చేసినట్లు ట్రాఫిక్-1 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. సంస్థలు తమ కార్యాలయాల స్థానం, ముందస్తు లాగౌట్ సమయాలను trfrcord@scsc.in ఈమెయిల్‌కు తెలియజేయాలని కోరారు. వర్షాల సమయంలో ట్రాఫిక్ నిర్వహణకు సంస్థలు సహకరించాలన్నారు. ప్రజలు కూడా అవసరమైతే మాత్రమే ప్రయాణాలు చేయాలని అధికారులు కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>