కలం, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో (Tirumala Ghee Scam) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫ్యాక్టరీస్, బాయిలర్స్ అధికారులపై శాఖాపరమైన విచారణ చేసేందుకు విచారణాధికారిగా ఉమామహేశ్వరరావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం – సిట్ (SIT) సిఫార్సుల మేరకు ప్రెజెంటింగ్ అధికారిగా జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ మోహన్రావు ఉండనున్నారు. ఈ మేరకు విచారణను మూడు నెలల్లో పూర్తిచేయాలని కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిట్ సిఫార్సుల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది.
Read Also: తొలిఏకాదశి.. తిరుమల, భద్రాచలంలో కిక్కిరిసిన భక్తులు
Follow Us On : WhatsApp

