కలం, మెదక్ బ్యూరో : హైదరాబాద్ మహానగర ప్రజలతో పాటు సంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చడానికి అధికారులు కీలక అడుగు వేశారు. సింగూరు ప్రాజెక్టు (Singur Project) నుంచి మంజీరా బ్యారేజీలోకి నీటిని విడుదల చేశారు. హైదరాబాద్ జలమండలి (HMWS) అధికారులు శనివారం సింగూరు ప్రాజెక్టు గేట్లను ఎత్తి 0.1 టీఎంసీల నీటిని మంజీరా బ్యారేజీలోకి వదిలారు. ఈ నీటి విడుదల ద్వారా హైదరాబాద్తో పాటు సంగారెడ్డి జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, పరిసర ప్రాంతాల ప్రజల తాగునీటి ఎద్దడి తీరనుంది.

