Mobile Popup Ad
Mobile Popup Ad

నిరుద్యోగులకు అలర్ట్.. టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ

కలం, వెబ్ డెస్క్: నిరుద్యోగులకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) శుభవార్త చెప్పింది. 19 మంది విత్తన ధ్రువీకరణ అధికారుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా తెలంగాణ విత్తన ధ్రువీకరణ, ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ఉద్యోగాల భర్తీ చేయబోతుంది. ఈ నెల ఏడో తేదీ నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి రాష్ట్ర స్థాయి ఉద్యోగాలు. అభ్యర్థి కచ్చితంగా అగ్రికల్చర్ డిగ్రీతో పాటు ఎంఎస్సీ ఆర్గానిక్ కోర్సులో భాగంగా స్పెషలైజేషన్ కింద సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, అగ్రోనమి, ప్లాంట్ సైకాలజీలో పీజీ చేసి ఉండాలి. ఇలా చేసి ఉన్నవారి దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెల వేతనం ప్రారంభం నుంచి రూ.51 వేలుగా ఉంటుంది. పూర్తి వివరాలకు కమిషన్ వెబ్ సైట్ సందర్శించాలని కోరింది.

చాలా రోజుల తరువాత..

టీజీపీఎస్సీ నుంచి వ్యవసాయ విభాగంలో చాలా రోజుల తరువాత నోటిఫికేషన్ రావడం గమనార్హం. తెలంగాణ విత్తన ఉత్పత్తికి దేశంలోనే గమ్యస్థానంగా పేరు సంపాదించింది. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసే క్రమంలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. అర్హత గల అభ్యర్థులు వెంటనే ప్రిపరేషన్ ప్రారంభిస్తే, విజయావకాశాలు మెరుగ్గా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>