కలం, వెబ్డెస్క్: భారత్ సుప్రసిద్ధ ఆధ్యాత్మిక కార్యక్రమం అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ఘనంగా ప్రారంభమైంది. జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ బేస్ క్యాప్ నుంచి లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) గురువారం ఉదయం జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. దీనికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, రాజకీయ నేతలు, పోలీసులు పాల్గొన్నారు. జెండా ఊపిన అనంతరం తొలి బృందం యాత్ర మొదలైంది. భక్తులు పహల్గామ్, బల్తాల్ మార్గాల ద్వారా పవిత్ర అమర్నాథ్ గుహకు చేరుకుంటారు.
మొదటి బృందంలో సుమారు 5 వేల మందికి పైగా భక్తులు యాత్రకు బయలుదేరారు. హర హర మహాదేవ్ అంటూ భక్తిపారవశ్యంతో అడుగులు ముందుకు వేస్తున్నారు. అమర్నాథ్ పవిత్ర గుహ వైపు వెళ్లే ఈ యాత్ర 57 రోజుల పాటు కొనసాగనుంది. అమర్నాథ్ యాత్ర అధికారికంగా జూలై 3న ప్రారంభమై ఆగస్ట్ 28న ముగియనుంది. భక్తుల సంరక్షణ కోసం కశ్మీర్ అంతటా సెక్యూరిటీ పెంచారు. కఠినమైన ట్రాఫిక్ నియంత్రణలతో పాటు పటిష్టమైన నిఘాతో భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు అమర్నాథ్ యాత్ర కోసం 3.90 లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నారు. అర్హులైన వారి కోసం జమ్మూలో తక్షణ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా కల్పించారు. నేటి నుంచి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. యాత్ర ముగిసే వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.

