మకావు ఓపెన్ సెమీస్‌లో ముగిసిన అశ్మితా చాలిహా పోరాటం

కలం, స్పోర్ట్స్ : మకావు ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత షట్లర్ అశ్మితా చాలిహా (Ashmita Chaliha) సెమీఫైనల్‌లో ఓడిపోవడంతో టోర్నీలో భారత సవాల్ ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌లో అశ్మితా చాలిహా దక్షిణ కొరియాకు చెందిన పార్క్ గా యున్‌తో తలపడింది. 38 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో అశ్మితా 21-17, 21-9 తేడాతో పరాజయం పాలైంది. మ్యాచ్ ఆరంభంలో అశ్మితా మంచి ఆటను ప్రదర్శించింది. తొలి గేమ్‌లో ఒక దశలో ఆమె 15-11 ఆధిక్యంలో నిలిచింది.

అయితే ఆ తర్వాత పార్క్ అద్భుతంగా పుంజుకుని తదుపరి 11 పాయింట్లలో 10 పాయింట్లు సాధించింది. దీంతో తొలి గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. మొదటి గేమ్ కోల్పోయిన తర్వాత రెండో గేమ్‌లో అశ్మితా తన లయను కొనసాగించలేకపోయింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పార్క్ వరుస పాయింట్లు సాధించి రెండో గేమ్‌ను కూడా గెలుచుకుంది. ఫలితంగా మ్యాచ్‌ను నేరుగా రెండు గేమ్‌ల్లో ముగించింది. ఈ ఓటమితో అశ్మితా చాలిహా మకావు ఓపెన్ సూపర్ 300 టోర్నీలో తన ప్రయాణాన్ని సెమీఫైనల్ దశలో ముగించగా, భారత జట్టు సవాల్ కూడా అక్కడితో ముగిసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>