కలం, వెబ్ డెస్క్ : సికిందరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’ కార్యక్రమం (At Home Programme) ఘనంగా జరిగింది. శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) సంప్రదాయంగా రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చారు. రాష్ట్రపతి నిలయం వేదికగా జరిగిన తేనిటి విందు కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మెన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ‘ఎట్ హోం’ కార్యక్రమం లో పాల్గొన్నారు.
Read Also: మరో ఉద్యమానికి పిలుపునిచ్చిన కేసీఆర్
Follow Us On: Instagram


